నేటితో ముగియనున్న ఆధార్ ఉచిత అప్డేట్ గడువు
హైదరాబాద్, డిసెంబర్ 14:
ఆధార్ కార్డు కలిగిన వారికి బిగ్ అలర్ట్! పదేళ్లుగా ఆధార్ కార్డ్ వివరాలు మార్చని వారికి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశానికి ఈరోజుతో (శనివారం) గడువు ముగియనుంది. రేపటి నుంచి ఆధార్ వివరాలను సవరించుకోవాలంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
గడువు పొడిగింపు మళ్లీ ఉంటుందా?
ఈ అవకాశం ఇప్పటికే యూఐడీఏఐ (UIDAI) పలు మార్లు పొడిగించినప్పటికీ, మరోసారి గడువు పెంచుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
ఎలా అప్డేట్ చేసుకోవాలి?
- మై ఆధార్ పోర్టల్కు లాగిన్ అవ్వాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, వివరాలను సవరించుకోవచ్చు.
- ఈ ప్రక్రియ నేటి వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ఈ సందర్భంగా ఆధార్ కార్డు వివరాలను సమీక్షించి, అవసరమైన మార్పులు వెంటనే చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
