మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్కు సంబంధించిన పార్టీ మార్పు వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు, దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.అలాగే, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయపరమైన పరిశీలన జరగనున్న నేపథ్యంలో, ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
