Breaking News

మంగళగిరిలో రామాలయ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్

మంగళగిరి, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మంగళగిరి పట్టణంలోని కొప్పురావుకాలనీలో నూతనంగా నిర్మించిన రామాలయ పునఃప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య హనుమత్, లక్ష్మణ, సీతాసమేత శ్రీరాముల వారి విగ్రహాల ప్రతిష్టాపనోత్సవాలను నిర్వహించారు. అనంతరం మంత్రి లోకేష్ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా దేవాలయం పునర్నిర్మాణానికి మంత్రి లోకేష్ రూ.5 లక్షల విరాళం అందజేశారు. స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ మహోత్సవం ప్రాంతంలో విశేషంగా నిలిచింది.

మత్స్యకారులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్..

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని మోదీ.. పవన్ నివాసానికి చిరంజీవి కూడా రాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *