Breaking News

Resilient to Telangana's mother in defiance of Revanth Reddy

రేవంత్ రెడ్డిని ధిక్కరించి తెలంగాణ తల్లికి శంకుస్థాపన

కల్వకుంట్ల కవిత సంచలనం: రేవంత్ రెడ్డిని ధిక్కరించి తెలంగాణ తల్లికి శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇచ్చిన జీవోను ధిక్కరించి, తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ చర్యతో కవిత, కాంగ్రెస్ తల్లిని కాదని, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. జగిత్యాల గడ్డపై శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన కవిత, ఈ సందర్భంగా కాంగ్రెస్‌ తల్లి విగ్రహం పై స్పందించారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, బీఆర్‌ఎస్‌ పార్టీ నేత కవిత, బతుకమ్మ ఉత్సవం ద్వారా మహిళలతో కలిసి నిరసన ప్రదర్శన చేశారు.

ఇందులో భాగంగా, పాత తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ, కాంగ్రెస్‌ మాత కంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని కవిత ప్రకటించారు.

ఇది తన అనుచరులు, అలాగే స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేసిన మరో బలప్రదర్శనగా భావిస్తున్నారు.

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *