ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతులకు కూడా నిధులు జమ చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లో ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య డబ్బులు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పాస్బుక్లు పొందిన సుమారు 85 వేల మందిలో 62 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, వారి అర్హతలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఇక యాసంగి సీజన్కు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. తొలి విడతలో ఇప్పటికే ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేయగా, రెండో, మూడో విడతల ద్వారా మిగిలిన మొత్తాన్ని అందించనుంది.మొత్తంగా ఈ సీజన్లో రైతులకు సుమారు రూ.9 వేల కోట్లను అందించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రైతులను కూడా చేర్చడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
