హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతించారు.ఈ తీర్పు ప్రభుత్వ పారదర్శకత, నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువతను కీలక భాగస్వాములుగా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.నియామక ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, సిబ్బందిని సీఎం అభినందించారు.
