Breaking News

“మా పనితీరు తెలుసుకోవాలంటే తెలంగాణకు రండి”.. రేవంత్ రెడ్డి సవాల్

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, యూడీఎఫ్ మేనిఫెస్టోపై వచ్చిన విమర్శలకు ఘాటుగా స్పందించారు.కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యం కాదని విమర్శిస్తున్న నేతలకు, “తెలంగాణకు వచ్చి మా ప్రభుత్వం పనితీరును పరిశీలించండి” అంటూ సవాల్ విసిరారు.యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేసిన రేవంత్, తెలంగాణలో ఇప్పటికే సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.రైతు భరోసా, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను ప్రస్తావిస్తూ తమ పాలనపై నమ్మకం ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

నీట్ పేపర్ లీక్‌లో ముగ్గురు ‘మనీషాలు’ అరెస్ట్

కర్ణాటకలో సీఎం మార్పు?.. సిద్దరామయ్య రాజీనామాపై జోరుగా ప్రచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *