హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కొత్త పెన్షన్ల కోసం ఇప్పటికే నిధులు కేటాయించినట్లు తెలిపారు. జూన్ 2 నుంచి ఈ పింఛన్ల పంపిణీ ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
ప్రస్తుతం పరిస్థితి
రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షలకుపైగా మంది వివిధ వర్గాల్లో చేయూత పింఛన్లు పొందుతున్నారు.
- వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు: రూ. 2,016
- దివ్యాంగులు: రూ. 4,016
భారీగా దరఖాస్తులు
కొత్త పింఛన్ల కోసం సుమారు 12 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
- వృద్ధాప్య పింఛన్: 4 లక్షలు
- వితంతు/ఒంటరి మహిళలు: 3.5 లక్షలు
- గీత, చేనేత కార్మికులు: 3 లక్షలు
- దివ్యాంగులు: 72 వేల దరఖాస్తులు
ఎంపిక ప్రక్రియ
ఈ దరఖాస్తుల్లో అర్హులైన 2 లక్షల మందిని ఎంపిక చేయడం పెద్ద సవాల్గా మారింది. జిల్లా స్థాయిలో కఠిన వడపోత జరుగుతోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమీక్ష కొనసాగిస్తున్నాయి.
