హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రైతు భరోసా పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెండో విడత నిధులను ఏప్రిల్ రెండో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.ఈ విడతలో సుమారు రూ.2,650 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.మొదటి విడతలో ఇప్పటికే భారీగా నిధులు విడుదల కాగా, మిగిలిన రైతులకు మూడో విడతలో చెల్లింపులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
