ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట. పెరిగిన డిమాండ్ దృష్ట్యా కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఏప్రిల్ మధ్యలో ప్రారంభమయ్యే ఈ ఫ్లైట్లు, ప్రయాణాన్ని కేవలం గంటలో పూర్తి చేసేలా సౌకర్యం కల్పించనున్నాయి.విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ పెరగడంతో విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ప్రయాణించే సమయాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
