ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలో టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, CITI తో కలిసి 13వ ఏషియా టెక్స్టైల్ సదస్సు (ATEXCON 2026)ను నిర్వహించి, పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ, జాతీయ, అంతర్జాతీయ వేత్తలను ఆహ్వానించారు.ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు, తెలంగాణకు చారిత్రక, సాంస్కృతిక, పత్తి ఉత్పత్తి నైపుణ్యాల కారణంగా వస్త్ర పరిశ్రమలో ముందంజ ఉంది. వరంగల్లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్ పార్క్, పత్తి పొలాలను ప్రపంచ ఫ్యాషన్ షోలకు అనుసంధానం చేయడం, డీప్టెక్, ఫార్మా, ఏరోస్పేస్ వంటి రంగాల్లో ముందస్తు మౌలిక సదుపాయాలతో రాష్ట్రం ఈ విజన్ సాధనలో ముందుంటుంది.
ఇక గ్లోబల్ ఫ్యాషన్, సినిమాతో సంబంధిత పరిశ్రమలను కూడా తెలంగాణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని, గ్రీన్ టెక్స్టైల్ హబ్ల ద్వారా పర్యావరణ పరిరక్షణను కూడా కలిపి, మహిళల సహకారంతో యువతకు శిక్షణనివ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రం 2034 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యం అని స్పష్టం చేశారు.







