ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి నేతృత్వంలో డిసిసి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాయకులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తదితరులు సమావేశంలో పాల్గొని పార్టీ కార్యకలాపాల సమీక్ష చేసి, భవిష్యత్తుకు వ్యూహాలు రూపొందించారు.






