ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ పై వేగంగా ముందుకు సాగుతోంది. మొదటి దశలో 21 కిలోమీటర్ల పరిధిలో సుమారు ₹6,500–7,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి మరో 9.2 కిమీ మార్గాలను అభివృద్ధి చేస్తోంది.ప్రాజెక్ట్లో గాంధీ సరోవర్, 123 అడుగుల గాంధీ విగ్రహం, శాంతి విగ్రహం, జాతీయ మ్యూజియం, ఖాదీ, చేనేత ప్రోత్సాహ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నదిలో మురుగునీరు చేరకుండా ఎస్టీపీలు, చెక్ డ్యామ్లు, రిటైనింగ్ వాల్స్ నిర్మించి, ఘాట్లు, వినోద, ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగరానికి ప్రత్యేక పర్యాటక, సాంస్కృతిక గుర్తింపు లభించనుంది.
