Breaking News

జూన్‌లో తల్లికి వందనం నిధులు.. విద్యార్థుల కుటుంబాలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: విద్యార్థుల కుటుంబాలకు ఊరట కలిగించేలా తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని జూన్ నెలలోనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏడాది రూ.15 వేల చొప్పున సాయం అందుతుంది. అయితే నిర్వహణ ఖర్చుల కోసం రూ.2 వేలును మినహాయించి, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13 వేలును జమ చేస్తారు.విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు ఉండటం, తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండటం తప్పనిసరి. తల్లిదండ్రులు లేని సందర్భాల్లో సంరక్షకుడి ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుంది.విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధులు అందించడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు తెలిపారు.

పుట్టావారిపాలెంలో ఘనంగా మహానాడు–2026 నిర్వహణ: మంత్రి గొట్టిపాటి రవికుమార్

మహానాడులో జగన్‌పై లోకేశ్ విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *