ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న రూ.57,821 కోట్ల విలువైన ప్రాజెక్టులపై వివరాలు తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.వారం, నెల వారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అమరావతిని భవిష్యత్ నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సీఎం ఆదేశించారు.
