Breaking News

మహిళలపై దాడులకు కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మాచర్లలో ఉద్యోగినిపై జరిగిన అత్యాచారయత్న ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.మహిళలను వేధించే వారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించిన సీఎం, ఇలాంటి ఘటనల్లో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ ఘటనపై ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

రాయచూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రుల హాజరు

రాజధాని పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రూ.57,821 కోట్ల పనులకు వేగం పెంచాలని ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *