ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు సమీప హోసళ్లీ క్యాంప్లో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్. డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ తో కలిసి పాఠశాలను ప్రారంభించారు.అనంతరం పాఠశాల ప్రాంగణంలో బసవేశ్వరుడు స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యా అభివృద్ధి, యువతకు నాణ్యమైన శిక్షణ అవసరాన్ని నేతలు ప్రస్తావించారు.












