ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన జగ్జీవన్ రామ్ ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
