Breaking News

ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

మైలవరం, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా మైలవరం సెంటర్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్రావు(గాంధీ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ ఉపప్రధానిగా,రాజ్యాంగాన్ని అమలుపరచడంలో కీలకంగా వ్యవహరించారని! కొనియాడారు.హరిత విప్లవానికి నాంది పలికిన నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని!ఆయన ఆశయాలను కొనసాగించాలని కూటమి నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ స్టేట్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్, జనసేన పార్టీ మైలవరం మండలం అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జొనబోయిన గోపాలస్వామి, తెలుగు యువత అధ్యక్షుడు లంకా లితీష్,గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చారుగుండ్ల ప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శోభన్ బాబు,మైలవరం టౌన్ జనసేనపార్టీ అధ్యక్షులు గజరావు శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు జీ.వి రవితేజ, జనసేన నాయకులు పొన్నూరు విజయ్,తోమ్మండ్రు నవీన్,పిఎసిఎస్ డైరెక్టర్ ప్రత్తి తిరుపతిరావు,కూసుమంచి కిరణ్ కుమార్,ఏ.శివరాం ప్రసాద్, మత్తి హరికృష్ణ,బడేమియా,కరీముల్లా మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి..!

బలిజ కాపుల పోరుదీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *