ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఎల్పీజీ కొరత ఉందనే వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రోజుకు లక్షల సంఖ్యలో సిలిండర్ల సరఫరా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని వెల్లడించింది.పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం, ఒక్కరోజులోనే సుమారు 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు పంపిణీ అవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ సజావుగా నడుస్తోందని అధికారులు తెలిపారు.ఆన్లైన్ బుకింగ్లు 95 శాతానికి చేరుకోగా, డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) విధానం 90 శాతం వరకు అమలవుతోంది. ఈ విధానం ద్వారా సరఫరాలో పారదర్శకత పెరిగి, అక్రమాలు తగ్గుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది.ఇక చిన్న 5 కిలోల సిలిండర్ల వినియోగం కూడా పెరుగుతోంది. ఇటీవల రోజుకు వేల సంఖ్యలో వీటి అమ్మకాలు నమోదవుతున్నాయి. అదేవిధంగా పైప్ గ్యాస్ (PNG) కనెక్షన్ల విస్తరణ కూడా వేగంగా జరుగుతోంది.దేశీయ అవసరాలకు తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించింది.
దేశంలో LPG కొరతలేదని కేంద్రం క్లారిటీ.. వదంతులకు చెక్
A man loads LPG cylinders onto a cart at a warehouse amid supply disruptions following the U.S.-Israeli conflict with Iran, in Mumbai, India, March 11, 2026. REUTERS/Francis Mascarenhas
