Breaking News

కరీంనగర్‌లో దారుణం.. కవల బాలికల హత్య కేసులో షాకింగ్ విషయాలు బయట

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఆడపిల్లలు పుట్టారనే కారణంతోనే కవల చిన్నారులను తండ్రే హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.పోలీస్ కమిషనర్ ఘౌస్ ఆలం తెలిపిన వివరాల ప్రకారం, శ్రీశైలం అనే వ్యక్తి తన కవల బాలికలను చంపాడు. ఈ ఘటనలో కుటుంబానికి చెందిన మరికొందరి పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు.హత్యను ప్రమాదంలా చిత్రీకరించేందుకు ముందుగానే ప్లాన్ చేసినట్టు విచారణలో బయటపడింది. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రతి నెలా పేద ఆర్యవైశ్యులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

ఒకే కిట్‌లో విద్యార్థుల అవసరాలన్నీ.. తెలంగాణ సర్కార్ సూపర్ ప్లాన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *