Breaking News

తెలంగాణలో బంజారా సమాజం కోసం కొత్త రాజకీయ సన్నాహాలు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారా సమాజ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రిటైర్డ్ అదిషనల్ డీజీ డీటీ నాయక్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై చర్చ జరిగింది.కవిత ఈ నెల 25న కొత్త పార్టీ ప్రారంభించబోతోంది. సమావేశంలో బంజారా సమాజానికి సముచిత అవకాశాలు కల్పించడానికి, వారి సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సమాలోచన జరిగింది. “మంత్రివర్గంలో బంజారాలకు ప్రాతినిధ్యం అందించని పరిస్థితి గతంలో లభించలేదు. కొత్త పార్టీ ద్వారా బంజారా సమాజానికి ప్రతినిధ్యం ఇస్తాము” అని కవిత హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ మాజీ కమిషనర్ లక్ష్మణ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్ నాయక్, ఇతర బంజారా ప్రముఖులు పాల్గొన్నారు. వారు పార్టీకి సలహాలు, సూచనలు అందించగా, ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించాలనుకునే వారికి స్వాగతం పలికారు.భేటీ ప్రధానంగా బంజారా సమాజ సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం మరియు కొత్త పార్టీ విధానాలపై దృష్టి పెట్టి జరిగింది.

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్‌కు ఉత్తమ్ సవాల్

చెరువుల కబ్జాలపై హైడ్రా దూకుడు.. కోకాపేటలో భారీ కూల్చివేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *