కరీంనగర్, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: వాసవి ట్రస్ట్ సభ్యుల ఆర్ధిక సహ కారంతో ప్రతి నెలా రూ. లక్ష నగదును వైద్యం, విద్య, వివాహాల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తునట్లు ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సంకటహర చతుర్థి రోజున 14 మందికి లక్షరూపాయల ఆర్థిక సహాయం అందించి నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాదికారి బొల్లం శ్రీనివాస్, రాచమల్ల భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
