Breaking News

అన్సారీకి పరామర్శ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై కవిత ఫైర్

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బంజారాహిల్స్‌లోని వెల్‌నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, కుటుంబ సభ్యులు మరియు వైద్యులతో మాట్లాడారు.ఈ సందర్భంగా కవిత తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కోసం పోరాడిన ప్రొఫెసర్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. 2023లో రిటైర్ అయినప్పటికీ ఇప్పటికీ హక్కులు అందకపోవడం వల్ల, చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్‌పై ఆధారపడాల్సి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఇదే పరిస్థితి మరెందరికో ఉందని, దాదాపు 143 మంది ప్రొఫెసర్లు బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. రిటైర్డ్ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ హక్కుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు.వెంటనే బకాయిలు చెల్లించి, రిటైర్డ్ ఉద్యోగులకు భరోసా కల్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

డీజీపీ కాన్వాయ్ ట్రయల్‌లో ఢీ.. ప్రమాదం తప్పింది

“రాష్ట్రంలో పోలీస్ రాజ్యం”.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజమెత్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *