ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్పై హీరోయిన్ త్రిష సరదాగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని హాస్యంగా తిప్పికొట్టారు.“సినిమాలకు గుడ్బై చెప్పేశానట.. కోటీశ్వరుడిని పెళ్లి చేసుకున్నానట.. నలుగురు పిల్లలను పెంచుతున్నానట.. ఇంకేమైనా మిగిలిందా?” అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై ఈ విధంగా ఫన్నీగా రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చారు త్రిష.
