హైదరాబాద్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే క్యాంపస్లో భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు ప్రారంభించారు.కేపీహెచ్బీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్తో కలిసి అడ్మిన్ భవనంలో సోదాలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు.ఈ మెయిల్ వెనుక నిజానిజాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
