Breaking News

సమాజంలో మార్పు జర్నలిస్టులతోనే సాధ్యం..!

విజయవాడ, ఏప్రిల్ 7, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సమాజంలో మార్పు తేవటం జర్నలిస్టులకే సాధ్యమని హెచ్ఆర్టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధునికీకరణకు ఇతోధికంగా సాయం చేసిన హనుమంతరావు ని మంగళవారం యూని యన్ నేతలు మర్యాద పూర్వకంగా కలిసి కృత జ్ఞతలు తెలిపారు. ఆయన వెంట తొండెపు శ్రీనివా స్ ఉన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ సమాజం లో జరుగుతున్న మార్పు లను పసిగట్టి అధ్యయనం చేసి ప్రజల పక్షాన నిలబడుతున్నది మీడియా మాత్రమే అని కొని యాడారు. సానుకూల దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకె ళ్ళినప్పుడే అభివృద్ధి సాధ్య మంటూ అమరావతి రాజధాని నిర్మాణ పనుల పై తన ఉద్దేశాన్ని తెలియ జేస్తూ వ్యాఖ్య చేశారు. కాలాను గుణంగా జరుగుతున్న మార్పులపై మాట్లాడారు. అనంతరం యూనియన్ నేతలు ఆయనకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూ డబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటే శ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ ఎస్ కే బాబు, సామ్నా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, యూనియన్ నేతలు జీ రఘురాం, శివ రామకృష్ణ, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

అమరావతికి రాజముద్ర.. ఆంధ్రుల కల నెరవేర్చిన చారిత్రాత్మక నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *