విజయవాడ. ఏప్రిల్ 7 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ తప్ప అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం పంపిస్తే, రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి గెజిట్ నోటి ఫికేషన్ విడుదల చేసిన సంగతి విడతమే దానికి అనుగుణంగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదే శం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి లాంటి రాక్షస రాజకీయ నాయకులు అమరావతి రాజధానిపై విషం చిమ్మ కుండా కూటమిప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు, తీసుకున్న చారిత్రా త్మక నిర్ణయం పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఉభ యసభల్లో ఉన్న అన్ని పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతిగా మద్దతు తెలిపాయని, కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ పార్టీ మాత్రం అమ రావతికి వ్యతిరేకంగా వ్యవహరించడం చూసి రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డిని చీదరించుకున్నారన్నారు.దేవతల రాజధాని అమరావతిగా రాబోయే రోజు ల్లోవిరాజిల్లుతుందన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి వర్యులు నారా లోకేష్ కి, ధన్యవాదాలు తెలియజే శారు. ఈ కార్యక్రమము లో మల్లెల విజయ్ కుమార్, పామర్తి కిషోర్ బాబు, వడ్లపట్ల గోపాల కృష్ణ (నాని), బత్తుల దుర్గారావు, కోడూరు ఆంజనేయ వాసు, కోనేరు రాజేష్, గొల్లపూడి నాగేశ్వ రరావు, జాస్తి సురేష్, యార్లగడ్డ రమేష్, ప్రేమ్ చంద్, మతిన్, సజ్జా రవి, పరుచూరి శ్రీనివాస్, దండ మూడి సుబ్బారావు, గుమ్మడి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

