ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. చిలకలగూడ, ఆదిభట్ల, సనత్నగర్ పోలీసుల చర్యల్లో భాగంగా సుమారు రూ.64.35 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.50,000 నగదు, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు ముందుగా ఉద్యోగాలు చేసి, తర్వాత టైల్స్ వ్యాపారం చేపట్టారు. ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో డ్రగ్స్ రవాణా, సరఫరా దందాలోకి దిగినట్లు విచారణలో వెల్లడైంది.పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ నెట్వర్క్కు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
