Breaking News

రాష్ట్రంలో ఉపాధి సృష్టిపై ఫోకస్.. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో మంత్రుల ఉపసంఘం సమావేశం నిర్వహించారుఉండవల్లిలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్‌తో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమలు, వాటి ద్వారా కల్పించిన ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్‌పై సమగ్రంగా చర్చించారు.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అందుకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పరిశ్రమలను తీసుకురావడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని సూచించారు.త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను భూమిపైకి తీసుకువచ్చి, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

వైఎస్సార్‌, రాజారెడ్డిపై టీడీపీ విమర్శలు.. షర్మిల ఫైర్

స్వర్ణాంధ్ర విజన్-2047పై సీఎం చంద్రబాబు సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *