Breaking News

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన.. ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ ఘనంగా

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ ప్రమాణ స్వీకార సమావేశం ఘనంగా జరిగింది. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జ్యోతి ప్రజ్వలన అనంతరం డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి అయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ సంకల్పమని తెలిపారు.బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని, ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పాలనపై కూడా విమర్శలు గుప్పిస్తూ, గత పదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో భారీగా ప్రజా ధనం వృథా చేశారని ఆరోపించారు.ప్రజల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అవసరమని, ప్రతి కార్యకర్త ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

నల్లగొండలో ప్రభుత్వ స్కూల్‌కు డిమాండ్.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల రద్దీ

మద్యం మత్తులో వేగం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలు బలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *