Breaking News

ఖర్గే వ్యాఖ్యలపై వివాదం.. క్షమాపణతో ముగింపు ప్రయత్నం

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి. గుజరాత్ ప్రజలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన స్పందించారు.తన మాటలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాదని ఖర్గే స్పష్టం చేశారు. గుజరాత్ ప్రజల పట్ల తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని పేర్కొంటూ క్షమాపణలు తెలిపారు.ఇదిలా ఉండగా, ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆక్షేపించింది. వివాదం మరింత పెరగకుండా ఉండేందుకు ఖర్గే క్షమాపణ చెప్పడం ద్వారా పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

నిబంధనల విషయంలో ఎలాంటి మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు

అమెరికా–ఇరాన్ కాల్పుల విరమణకు భారత్ స్వాగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *