Breaking News

ఎల్పీజీ సిలిండర్లపై కొత్త నియమాలు అమల్లోకి

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై గ్యాస్ గిడ్డంగులు లేదా ఏజెన్సీల నుంచి నేరుగా వినియోగదారులకు సిలిండర్ల విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది.సిలిండర్లు కేవలం బుకింగ్ చేసిన వినియోగదారుల ఇళ్లకే హోమ్ డెలివరీ రూపంలో అందజేయబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గోడౌన్ల వద్దకు వెళ్లి సిలిండర్లు తీసుకోవద్దని ప్రజలకు సూచించింది.ప్రస్తుతం సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సగటున నాలుగు రోజుల్లో సిలిండర్ డెలివరీ జరుగుతోందని వెల్లడించారు.చిరునామా రుజువు లేని వలస కార్మికుల కోసం 5 కిలోల చిన్న సిలిండర్లను అందుబాటులోకి తెచ్చారు. గుర్తింపు కార్డు చూపించి వీటిని సులభంగా పొందే విధానం అమల్లోకి వచ్చింది.అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, గ్యాస్ ఏజెన్సీలపై తనిఖీలు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజలు అధికారిక మార్గాల్లోనే సిలిండర్లు పొందాలని విజ్ఞప్తి చేసింది.

UPI లావాదేవీలపై కొత్త నియంత్రణలు.. ఆర్‌బీఐ కీలక ప్రతిపాదనలు

ఆధార్‌లో వివరాల మార్పులకు కఠిన నియంత్రణలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *