Breaking News

నిబంధనల విషయంలో ఎలాంటి మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గానికి చెందినవారనే కారణంతో నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.ఢిల్లీ పోలీస్ నియామక ప్రక్రియకు సంబంధించిన కేసులో ఈ కీలక తీర్పు వెలువడింది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థి శారీరక పరీక్షకు హాజరుకాకపోయినా, మరో అవకాశం ఇవ్వాలని కోరాడు. అయితే సుప్రీంకోర్టు దీనిని అంగీకరించలేదు.శారీరక పరీక్షకు హాజరు కాకపోవడం బాధ్యతారాహిత్యంగా పరిగణించాల్సిందేనని కోర్టు పేర్కొంది. పోటీ పరీక్షల్లో నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, ఒకరి కోసం వాటిని మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.సానుభూతి, సామాజిక నేపథ్యం వంటి అంశాలకు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వకూడదని, సమానత్వం మరియు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఖర్గే వ్యాఖ్యలపై వివాదం.. క్షమాపణతో ముగింపు ప్రయత్నం

అమెరికా–ఇరాన్ కాల్పుల విరమణకు భారత్ స్వాగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *