వినియోగదారులకు అసౌకర్యం కలిగించద్దు
వినియోగదారులకు గ్యాస్ ను ఇంటి కి డోర్ డెలివరీ చేయాలి
రాష్ట్ర సివిల్ సప్లయిస్ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్
మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తాడేపల్లి లోని బాలాజీ గ్యాస్ కంపెనీని రాష్ట్ర సివిల్ సప్లయిస్ డైరెక్టర్ శ్రీమతి శ్రీవాస్ నుపూర్ మంగళవారం తనిఖీ చేశారు.కంపెనీకి వచ్చిన వినియోగదారులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి, తొలి ప్రాధాన్యత ఇవ్వాలని,వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.అలాగే గ్యాస్ సిలిండర్లును, గోడౌన్ వద్ద ఇవ్వొద్దని, ఇంటికి డోర్ డెలివరీ చేయాలని,నిర్లక్ష్యం వహిస్తే గ్యాస్ ఏజెన్సీ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా సివిల్ సప్లయిస్ అధికారిణి కోమలి పద్మ, సి.ఎస్.డిటి శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
