Breaking News

విద్యార్థులకు శుభవార్త.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో మండుతున్న ఎండల నేపథ్యంలో విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈసారి వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తూ షెడ్యూల్ విడుదల చేసింది.ప్రస్తుతం కొనసాగుతున్న ఒంటి పూట బడుల తర్వాత, ఏప్రిల్ 23ను చివరి పని దినంగా నిర్ణయించారు. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయి.పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 16తో ముగియనున్నాయి. 1 నుంచి 9వ తరగతుల వార్షిక పరీక్షలు కూడా త్వరలో పూర్తిచేసి, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందించనున్నారు.అలాగే ఏప్రిల్ 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి, విద్యా సంవత్సరం ముగింపుని అధికారికంగా ప్రకటించనున్నారు. కొత్త విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది.ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మెడికల్‌, డెంటల్‌ కాలేజీల ఫీజులపై కఠిన నిర్ణయం

తెలంగాణలో రక్షణ రంగ పెట్టుబడులకు ఆసక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *