Breaking News

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: విజయవాడ టెర్రర్ లింక్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం పాత్రపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, మహిళలను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించే ప్రయత్నాలు జరిగినట్లు తేలింది.ప్రత్యేకంగా యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని రిక్రూట్ చేయాలని ఉగ్రవాద సంస్థలు బాధ్యత అప్పగించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే పలువురు యువతులు ఈ నెట్‌వర్క్‌లోకి చేరినట్లు సమాచారం.సోషల్ మీడియా వేదికగా “Khawateen” పేరుతో గ్రూప్ నిర్వహిస్తూ మహిళల్లో తీవ్రవాద భావజాలాన్ని పెంచే ప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. పలు అకౌంట్ల ద్వారా వీడియోలు, సందేశాలు షేర్ చేస్తూ ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.అంతేకాకుండా, ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాలపై సమాచారం ఉన్న ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని సంబంధాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

వైఎస్సార్‌, రాజారెడ్డిపై టీడీపీ విమర్శలు.. షర్మిల ఫైర్

స్వర్ణాంధ్ర విజన్-2047పై సీఎం చంద్రబాబు సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *