Breaking News

యూకే నుంచి వచ్చిన మెగా అభిమానుల రక్తదానం – చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో సేవా కార్యక్రమం

ఏప్రిల్ 09 నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో యూకేకు చెందిన మెగా అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మెగా కుటుంబంపై అపారమైన ప్రేమతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వారిలో ప్రత్యేకతగా నిలుస్తోంది.లండన్‌లో నివసిస్తున్న అభిమానులు, మెగా హీరోలు అక్కడికి వెళ్లినప్పుడల్లా ఎంత దూరమైనా ప్రయాణించి వారిని కలవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అదే అభిమానంతో భారత్‌కు వచ్చిన ప్రతిసారి చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో రక్తదానం చేయడం కూడా వారు అలవాటుగా మార్చుకున్నారు.ఈ క్రమంలో శ్రీమతి హారిక యడ్ల, శ్రీ నాగేంద్ర కలకోటతో పాటు వారి స్నేహితులు కలిసి రక్తదానం చేశారు. వారి సేవా భావాన్ని ప్రశంసిస్తూ చిరంజీవి బ్లడ్ సెంటర్ నిర్వాహకులు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.మెగా కుటుంబంపై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాల ద్వారా చూపిస్తున్న ఈ అభిమానులను అందరూ అభినందిస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్‌కు ఉత్తమ్ సవాల్

చెరువుల కబ్జాలపై హైడ్రా దూకుడు.. కోకాపేటలో భారీ కూల్చివేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *