ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యూఐ జెండాను ఆవిష్కరించారు.రాష్ట్ర అధ్యక్షుడు వెంకట స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చంద్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.



