హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 9, (నేటి తెలుగు పత్రిక): స్థానిక శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని ఈరోజు మన రాష్ట్ర గౌరవనీయులైన హోం మంత్రి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన హోం మంత్రి కి దేవస్థాన ఛైర్మన్ వేమూరి శ్రీనివాసరావు , అర్చకులు మరియు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం హోం మంత్రి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధా క్రిష్నయ్య మరియు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి, స్వామి వారి శేష వస్త్రం మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా మంత్రి అనిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ముఖ్య ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
