ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ కొత్తగా కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీకి రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎ. గోపాల్ రెడ్డిని చైర్మన్గా నియమించారు. మొత్తం 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.విద్యార్థులపై అధిక ఫీజుల భారం పడకుండా చూడటం, ఫీజు విధానంలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
