ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్, తుక్కు, రసాయనాలు నిల్వ ఉంచిన గోడాంలో మొదలైన మంటలు సమీపంలోని రెండంతస్తుల ఇంటికి వ్యాపించాయి.గోడాంలో ఉన్న దహనశీల పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించగా, గాలి తీవ్రతతో అవి మరింత విస్తరించాయి. మంటలు ఇంటికి చేరడంతో అక్కడి కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో గోడాంలో నిల్వ ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.అగ్నిమాపక శాఖ అధికారులు గోడాంలలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా రసాయనాలు మరియు ప్లాస్టిక్ పదార్థాలను నిల్వ చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
