Breaking News

హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. గచ్చిబౌలి మార్గంలో ఏడాది పాటు ఆంక్షలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లోని ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. గచ్చిబౌలి–లింగంపల్లి రహదారిపై నిర్మాణ పనుల కారణంగా ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణం ప్రారంభమవడంతో వాహనాల రాకపోకలను పరిమితం చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌పై నియంత్రణలు అమలు చేయనున్నారు.గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, కొండాపూర్ దిశగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు.ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని, నావిగేషన్ యాప్‌ల సహాయంతో మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.నిర్మాణ పనులు పూర్తయ్యాక ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అప్పటివరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్‌ఎస్‌యూఐ 56వ ఆవిర్భావ దినోత్సవం.. ఇందిరా భవన్‌లో వేడుకలు

పొంగులేటిపై హరీష్‌రావు ఘాటు విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *