ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలంగాణలో పటాన్చెరు ప్రాంతంలో జాతీయ రహదారి విస్తరణ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఎంపీ పటాన్చెరు డివిజన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత భవనం స్థలాన్ని పరిశీలించి, కొన్ని అజ్ఞాత వ్యక్తులు రాత్రి సమయంలో భవనాన్ని పూర్తిగా కూల్చివేసారని తెలిపారు. ఇది చట్టవిరుద్ధమైన చర్యని ఆయన స్పష్టం చేశారు.రఘునందన్ రావు, స్థానిక బీజేపీ నాయకుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులను సమాచారం ఇచ్చారని, అధికారులు రంగంలోకి దిగడంతో కబ్జాదారులు పరారయ్యారని చెప్పారు.అతను అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ భూములను, ముఖ్యంగా విద్యాసంస్థల స్థలాలను రక్షించడం అత్యంత కీలకమని ఎంపీ పేర్కొన్నారు.
