ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గోవాలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ పశ్చిమ ప్రాంత సదస్సులో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయ్యన్నపాత్రుడు ప్రతిపాదన ప్రకారం, 40 ఏళ్ల లోపు యువతకు చట్టసభల్లో కనీసం 33 శాతం సీట్లు రొటేషన్ పద్ధతిలో రిజర్వ్ చేయాలని సూచించారు. ఇది యువతను రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళడానికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రస్తుతం దేశంలో లోక్సభ సభ్యుల సగటు వయసు 56, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 53 సంవత్సరాలు ఉండటంతో యువతకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుదనం తగ్గడం, నాయకత్వం వచ్చిన హోదా కోసం అవకాశాల తగ్గుదల కూడా సమస్య అని స్పష్టం చేశారు.అయితే, సరైన అవకాశాలు కల్పిస్తే యువత తప్పకుండా రాజకీయాల్లో రాణిస్తారని అయ్యన్నపాత్రుడు భరోసా ఇచ్చారు.
