ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ గాంధీ భవన్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన జనగామ, తుంగతుర్తి నియోజకవర్గాల నాయకులతో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్యా, ఎమ్మెల్యే శామ్యూల్, అలాగే వివిధ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ భేటీ కొనసాగింది. మండల కమిటీలు, జిల్లా కమిటీల నియామకంపై సవివరంగా చర్చించి, సమర్థులైన నాయకులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు.టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ, కార్యకర్తలే పార్టీకి బలం అని, వారికి తగిన గుర్తింపు కల్పించడం ద్వారా పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని మరింత బలంగా నిలబడాలని పిలుపునిచ్చారు.సమావేశంలో పాల్గొన్న ఇతర నేతలు కూడా పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలని, నిజాయితీగా పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. త్వరలోనే కొత్త కమిటీల నియామకాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
