హైదరాబాద్, ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి దివ్యవాణి చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సామాజిక అంశాలపై చర్చించినట్లు తెలిసింది.ఇటీవల నిర్వహించిన ‘బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ కార్యక్రమం గురించి దివ్యవాణి వివరించారు. మహిళల ప్రతిభను గుర్తించి గౌరవించే లక్ష్యంతో ఈ అవార్డులను ప్రారంభించినట్లు తెలిపారు.హైదరాబాద్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.తొలి అవార్డును ప్రముఖ నటుడు చిరంజీవి తల్లి అంజనాదేవికి ప్రకటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె తరఫున కుటుంబ సభ్యులు అవార్డును స్వీకరించారు.మహిళల సాధికారతకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని దివ్యవాణి తెలిపారు. భవిష్యత్తులో ఈ అవార్డులను మరింత విస్తరించి దేశవ్యాప్తంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
