విస్సన్నపేట ఏప్రిల్ 10 (నేటి తెలుగు పత్రిక ): ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నిస్సాహయుల కుటుంబాలకు ఆర్థికచేయుత అందించిన టిడిపి పెద్దలు వారిని పరామర్శించి గుండె నిండా ధైర్యాన్ని నింపుతున్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా సమయం ఏదైనా సమస్య ఏదైనా మేమున్నామంటూ భరోసా ఇస్తూ మండలంలో టిడిపి పెద్దలు ముందడుగు వేస్తున్నారు. వైద్య చికిత్సలు నిర్వహించుకునేందుకు మరియు చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ ఆర్థిక చేయూత అందిస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా బి జే ఆర్ నగర నందు మెసపాం కుటుంబరావు( కృష్ణ), బొడ్డు భాస్కరరావు సింగపాం ఇమ్మానుయేలు కుటుంబాలకు మాగంటి నాని (సత్యనారాయణ చౌదరి ) సహకారంతో మండల టిడిపి అధ్యక్షులు రాయల సుబ్బారావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి డాబా శ్రీను,టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు కొంగల శ్రీనివాసరావు చేతుల మీదుగా శుక్రవారం ఆర్థిక చేయూత అందించారు. ఈ కార్యక్రమంలో లలితా రామకృష్ణ, తిరువూరు ఏఎంసి డైరెక్టర్ పల్లెపాం రాంబాబు, ముత్తం శెట్టి వంశీ కమతం సురేష్, అబ్బినేని మల్లి , సగ్గుర్తి సుధీర్, దగ్గుల నాని, జొన్నలగడ్డ సుధాకర్, బొడ్డు భూషణం అశోక్ మేకల కిరణ్, గుమ్ము తదితరులు పాల్గొన్నారు.
