ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12న ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుంది.ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన పరీక్షలకు సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.ఫలితాల అనంతరం రీకౌంటింగ్, రీవాల్యూయేషన్కు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు కేవలం అధికారిక వెబ్సైట్ల ద్వారానే ఫలితాలను పరిశీలించాలని సూచించారు.
