ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: త్వరలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వార్తలను అందించే కొత్త డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ వేదిక నిష్పక్షపాతంగా, సమతుల్యంగా వార్తలను అందిస్తూ సత్యానికి కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలిపారు.ప్రజలకు స్వరం కల్పించడం, సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు మరియు అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వేదిక పూర్తిగా స్వతంత్రంగా ఉండి ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పనిచేస్తుందని స్పష్టం చేశారు.డిజిటల్ వేదిక విజయవంతమైన తర్వాత అదే విలువలతో ఒక తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ను కూడా ప్రారంభించాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. వేదిక పేరును త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
